ఆదికాండము 18లో అబ్రహామును దర్శించిన ముగ్గురు మనుష్యులు ఎవరు?
మరియు మమ్రేదగ్గర నున్న సింధూర వనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని యున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని యెదుట నిలువబడి యుండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి, నేలమట్టుకు వంగి నమస్కరించెను. (ఆదికాండము 18:1-3)
అబ్రాహాము ఆ ముగ్గురు మనుష్యులకు వెంటనే మర్యాదలు అందించాడు, వారిని ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకోమని కోరాడు మరియు వారికి భోజనం సిద్ధం చేశాడు.
ఈ "పురుషులు" ముగ్గురూ అబ్రాహాముకు మనుష్యుల రూపంలో కనిపించిన దేవదూతలని కొందరు సూచించారు. అయితే, ఆదికాండము 18:1 అబ్రాహాముకు కనిపించినది "యెహోవా" (ప్రభువు) అని చెబుతోంది.
ఆ ముగ్గురు "మనుష్యులలో" ఒకడు సర్వశక్తిమంతుడైన దేవుడు మనిషి రూపాన్ని పొందాడు. అటువంటి రూపాన్ని మనం "థియోఫనీ" అని అంటాము. (గ్రీకు థియోఫానియా నుండి, "దేవుని స్వరూపం"). పాత నిబంధనలో ప్రభువైన యేసయ్య తన పూర్వ-అవతార శరీరంలో కనిపించినప్పుడు, మనం దానిని "క్రిస్టోఫానీ" అని అంటాము. ఆదికాండము 19:1లో, ఇద్దరు మనుష్యులను స్పష్టంగా "ఇద్దరు దేవదూతలు" అని అంటున్నాము.
అది దేవుడని అబ్రాహాముకు ఎలా తెలుసు?
యెహోవా అబ్రాహాముతో ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడిన మరియు/లేదా కనిపించినందున, అబ్రాహాము ఆయనతో బాగా పరిచయం కలిగి ఉన్నాడు మరియు ఆయనని సులభంగా గుర్తించగలడు. అలాంటి కలుసుకోవడంలో ఈ క్రింది సందర్భాలు ఉన్నాయి:
• దేవుడు అతనిని మొదటిసారి పిలిచినప్పుడు (ఆదికాండము 12:1-3)
• అబ్రాహాము లోతుతో విడిపోయినప్పుడు (ఆదికాండము 13:14–17)
• బహుశా అతడు మెల్కీసెదెకును కలిసినప్పుడు (ఆదికాండము 14:18–20)
• దేవుడు అతనితో నిబంధన చేసినప్పుడు (ఆదికాండము 15)
• దేవుడు తన నిబంధనను మళ్లీ స్థాపించినప్పుడు (ఆదికాండము 17)
మనం ఎవరితో మాట్లాడుతున్నామో మనకు ఎప్పుడూ తెలియదు కాబట్టి, ప్రతి ఒక్కరినీ వారు దేవుని నుండి ప్రత్యేకమైన కార్యంలో ఉన్నట్లుగా భావించాలి. హెబ్రీయులకు 13:2 ఇలా సెలవిస్తుంది, "అపరిచితులకు ఆతిథ్యము చేయడం మరువకూడదు, ఎందుకంటే అలా చేయడం ద్వారా కొందరు తమకు తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి."
శారా భయపడి, "నేను నవ్వలేదని చెప్పగా" ఆయన అవును నీవు నవ్వితివిననెను. (ఆదికాండము 18:15)
బైబిలు చెబుతోంది, శారా భయపడింది. చాలా మంది భయంతో నిజం (సత్యాన్ని) మాట్లాడరు.
అబ్రాహాము యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు?
ఒక విజ్ఞాపం ప్రార్థనపరుడు మరొకరి స్థానాన్ని తీసుకుంటాడు లేదా మరొకరి స్థితిని వాదిస్తాడు. ఒక బైబిలు ఉదాహరణ అబ్రాహాము రెండు నగరాల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసాడు —సొదొమ మరియు గొమొర్రా. ఆదికాండము 18:22-32లో ఆ సందర్భం గురించి చదవండి
సొదొమలో ఉన్న భయంకరమైన పాపాలను పరిశీలించండి - అయినా దేవుడు పది మంది ప్రజల కోసం మొత్తం దేశాన్ని పాడుచేయనని చెప్పాడు. క్రైస్తవులమైన మనం లేకుంటే ఈ లోకం ఎప్పుడో నాశనం అయ్యేది. యేసు అన్నాడు, "మీరు లోకమునకు ఉప్పయి యున్నారు" (మత్తయి 5:13).
అబ్రహాము చుట్టూ కూర్చుని వారు ఎంత దుర్మార్గులని మరియు వారందరూ ఎలా నరకానికి వెళుతున్నారో అనే దాని గురించి మాట్లాడలేదు. అతడు వారి తరపున విజ్ఞాపన ప్రార్థన చేసాడు!
నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును, బద్దలైన సందులలో నిలుచుటకును, తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడ లేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలము వారి మీదికి రప్పించి నా ఉగ్రతాగ్నిచేత వారిని దహింతును; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. (యెహెజ్కేలు 22:30-31)
ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రాహాము రెండు నగరాల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసాడు. ఇక్కడ దేవుడు మొత్తం దేశం గురించి మాట్లాడుతున్నాడు. బద్దలైన సందులలో నిలబడ గలిగి, దేశం తరపున విజ్ఞాపన ప్రార్థన చేసే ఒక వ్యక్తిని ఆయన కనుగొనగలిగితే, తీర్పు వచ్చేది కాదు.
మరియు మమ్రేదగ్గర నున్న సింధూర వనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని యున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని యెదుట నిలువబడి యుండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి, నేలమట్టుకు వంగి నమస్కరించెను. (ఆదికాండము 18:1-3)
అబ్రాహాము ఆ ముగ్గురు మనుష్యులకు వెంటనే మర్యాదలు అందించాడు, వారిని ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకోమని కోరాడు మరియు వారికి భోజనం సిద్ధం చేశాడు.
ఈ "పురుషులు" ముగ్గురూ అబ్రాహాముకు మనుష్యుల రూపంలో కనిపించిన దేవదూతలని కొందరు సూచించారు. అయితే, ఆదికాండము 18:1 అబ్రాహాముకు కనిపించినది "యెహోవా" (ప్రభువు) అని చెబుతోంది.
ఆ ముగ్గురు "మనుష్యులలో" ఒకడు సర్వశక్తిమంతుడైన దేవుడు మనిషి రూపాన్ని పొందాడు. అటువంటి రూపాన్ని మనం "థియోఫనీ" అని అంటాము. (గ్రీకు థియోఫానియా నుండి, "దేవుని స్వరూపం"). పాత నిబంధనలో ప్రభువైన యేసయ్య తన పూర్వ-అవతార శరీరంలో కనిపించినప్పుడు, మనం దానిని "క్రిస్టోఫానీ" అని అంటాము. ఆదికాండము 19:1లో, ఇద్దరు మనుష్యులను స్పష్టంగా "ఇద్దరు దేవదూతలు" అని అంటున్నాము.
అది దేవుడని అబ్రాహాముకు ఎలా తెలుసు?
యెహోవా అబ్రాహాముతో ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడిన మరియు/లేదా కనిపించినందున, అబ్రాహాము ఆయనతో బాగా పరిచయం కలిగి ఉన్నాడు మరియు ఆయనని సులభంగా గుర్తించగలడు. అలాంటి కలుసుకోవడంలో ఈ క్రింది సందర్భాలు ఉన్నాయి:
• దేవుడు అతనిని మొదటిసారి పిలిచినప్పుడు (ఆదికాండము 12:1-3)
• అబ్రాహాము లోతుతో విడిపోయినప్పుడు (ఆదికాండము 13:14–17)
• బహుశా అతడు మెల్కీసెదెకును కలిసినప్పుడు (ఆదికాండము 14:18–20)
• దేవుడు అతనితో నిబంధన చేసినప్పుడు (ఆదికాండము 15)
• దేవుడు తన నిబంధనను మళ్లీ స్థాపించినప్పుడు (ఆదికాండము 17)
మనం ఎవరితో మాట్లాడుతున్నామో మనకు ఎప్పుడూ తెలియదు కాబట్టి, ప్రతి ఒక్కరినీ వారు దేవుని నుండి ప్రత్యేకమైన కార్యంలో ఉన్నట్లుగా భావించాలి. హెబ్రీయులకు 13:2 ఇలా సెలవిస్తుంది, "అపరిచితులకు ఆతిథ్యము చేయడం మరువకూడదు, ఎందుకంటే అలా చేయడం ద్వారా కొందరు తమకు తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి."
శారా భయపడి, "నేను నవ్వలేదని చెప్పగా" ఆయన అవును నీవు నవ్వితివిననెను. (ఆదికాండము 18:15)
బైబిలు చెబుతోంది, శారా భయపడింది. చాలా మంది భయంతో నిజం (సత్యాన్ని) మాట్లాడరు.
అబ్రాహాము యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు?
ఒక విజ్ఞాపం ప్రార్థనపరుడు మరొకరి స్థానాన్ని తీసుకుంటాడు లేదా మరొకరి స్థితిని వాదిస్తాడు. ఒక బైబిలు ఉదాహరణ అబ్రాహాము రెండు నగరాల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసాడు —సొదొమ మరియు గొమొర్రా. ఆదికాండము 18:22-32లో ఆ సందర్భం గురించి చదవండి
సొదొమలో ఉన్న భయంకరమైన పాపాలను పరిశీలించండి - అయినా దేవుడు పది మంది ప్రజల కోసం మొత్తం దేశాన్ని పాడుచేయనని చెప్పాడు. క్రైస్తవులమైన మనం లేకుంటే ఈ లోకం ఎప్పుడో నాశనం అయ్యేది. యేసు అన్నాడు, "మీరు లోకమునకు ఉప్పయి యున్నారు" (మత్తయి 5:13).
అబ్రహాము చుట్టూ కూర్చుని వారు ఎంత దుర్మార్గులని మరియు వారందరూ ఎలా నరకానికి వెళుతున్నారో అనే దాని గురించి మాట్లాడలేదు. అతడు వారి తరపున విజ్ఞాపన ప్రార్థన చేసాడు!
నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును, బద్దలైన సందులలో నిలుచుటకును, తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడ లేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలము వారి మీదికి రప్పించి నా ఉగ్రతాగ్నిచేత వారిని దహింతును; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. (యెహెజ్కేలు 22:30-31)
ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రాహాము రెండు నగరాల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసాడు. ఇక్కడ దేవుడు మొత్తం దేశం గురించి మాట్లాడుతున్నాడు. బద్దలైన సందులలో నిలబడ గలిగి, దేశం తరపున విజ్ఞాపన ప్రార్థన చేసే ఒక వ్యక్తిని ఆయన కనుగొనగలిగితే, తీర్పు వచ్చేది కాదు.
Chapters
- అధ్యాయం 1
- అధ్యాయం 2
- అధ్యాయం 3
- అధ్యాయం 4
- అధ్యాయం 5
- అధ్యాయం 6
- అధ్యాయం 7
- అధ్యాయం 8
- అధ్యాయం 9
- అధ్యాయం 10
- అధ్యాయం 11
- అధ్యాయం 12
- అధ్యాయం 13
- అధ్యాయం 14
- అధ్యాయం 15
- అధ్యాయం 16
- అధ్యాయం 17
- అధ్యాయం 18
- అధ్యాయం 19
- అధ్యాయం 20
- అధ్యాయం 21
- అధ్యాయం 22
- అధ్యాయం 23
- అధ్యాయం 24
- అధ్యాయం 25
- అధ్యాయం 26
- అధ్యాయం 27
- అధ్యాయం 28
- అధ్యాయం 29
- అధ్యాయం 30
- అధ్యాయం 31
- అధ్యాయం 32
- అధ్యాయం 33
- అధ్యాయం 34
- అధ్యాయం 35
- అధ్యాయం 36
- అధ్యాయం 37
- అధ్యాయం 38
- అధ్యాయం 39
- అధ్యాయం 40
- అధ్యాయం 41
- అధ్యాయం 42
- అధ్యాయం 43
- అధ్యాయం 44
- అధ్యాయం 45
- అధ్యాయం 46
- అధ్యాయం 47
- అధ్యాయం 48
- అధ్యాయం 49
- అధ్యాయం 50