జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొని యున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని యున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింప బడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని యున్నాడు. (1 కొరింథీయులకు 1:28-29)
దేవుడు తన అద్భుతమైన ఉద్దేశాలను నెరవేర్చడానికి ఉద్దేశపూర్వకంగా బలహీనమైన విషయాలను ఉపయోగిస్తాడు. దేవుడు ఈ విధంగా చేయటానికి గల కారణం "ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకూడదు" (1 కొరింథీయులు 1:27). దేవునికి మాత్రమే సమస్త మహిమ చెందాలి.
ఇస్కరియోతు యూదా పన్నెండు మంది అపొస్తలులలో ఒకడు. అతడు ఒక అభిషిక్తుడు, అతడు దెయ్యాలను వెళ్లగొట్టగలడు మరియు రోగులను స్వస్థపరచగలడు. అతడు, ఇతర అపొస్తలులు మరియు ప్రభువు శిష్యులతో కలిసి, పరిచర్య యాత్రలో బాగా ఉపయోగించబడ్డాడు. (మత్తయి 10 చదవండి)
ఏదేమైనా, యూదాలో బలహీనత ఉంది, అది స్పష్టంగా కనిపించలేదు, ఎందుకంటే అతడు దానిని బాగా మరుగుపరచగలిగాడు. యోహాను 12:6లో, పరిశుద్ధాత్మ తన బలహీనతను తెలియపరుస్తుంది. "... దొంగయై యుండి, తన దగ్గర డబ్బు సంచియుండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను."
అనేక సందర్భాల్లో, తన దగ్గరకు వచ్చిన పురుషులు మరియు స్త్రీలలో లోతైన రహస్యాలను ప్రభువు ఎలా వెల్లడి చేస్తాడో యూదా చూశాడు. ఆయన మహా కృప ద్వారా పాపులు ఎలా రక్షింపబడ్డారో కూడా అతడు చూశాడు. కానీ ఇవన్నీ తెలిసినప్పటికీ, యూదా తన స్వభావలోపాన్ని వ్యక్తిగతంగా యేసు వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. అతడు కోరుకుంటే అతడు చేసి ఉండవచ్చు మరియు అతడు బలహీనతను అధిగమించడానికి యూదా కృపను పొందాడని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను.
ప్రభువుకు కూడా దీని గురించి తెలుసు మరియు యూదా దానిని అంగీకరించాలని కోరుకున్నాడు; యూదా మారాలని ఆయన కోరుకున్నాడు, కానీ యూదా అలా చేయలేదు, చివరికి, ఇదే స్వభావ లోపం వల్ల యూదా తన యజమానిని కేవలం 30 వెండి నాణెములకు అమ్మడానికి కారణమైంది - బానిస ధర. మీరు వనరులు మరియు సంబంధాలను ఎలా నిర్వహిస్తారో అప్పుడే నిజమైన స్వభావం కనిపిస్తుంది.
మనం బలహీనులమని గుర్తించినప్పుడు మాత్రమే, మన మారుముఖమును కొనసాగించడానికి ప్రయత్నించడం మానేసి, దాని బదులుగా మన పోరాటాలకు విడుదల, స్వస్థత మరియు ఓదార్పునిచ్చే మన దేవుని సమృద్ధి మరియు క్షేమం వైపు చూడవచ్చు.
మనం ఎంత బలహీనంగా ఉన్నా లేదా హానికరముగా ఉన్నా, మన బలహీనతలను మనం ఒప్పుకుని, దేవునికి అప్పగించగలిగితే, దానిపై మనకు విజయం పొందడానికి తగిన కృప లభిస్తుందని నేను నమ్ముతున్నాను. (2 కొరింథీయులు 12:9)
దేవుడు తన అద్భుతమైన ఉద్దేశాలను నెరవేర్చడానికి ఉద్దేశపూర్వకంగా బలహీనమైన విషయాలను ఉపయోగిస్తాడు. దేవుడు ఈ విధంగా చేయటానికి గల కారణం "ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకూడదు" (1 కొరింథీయులు 1:27). దేవునికి మాత్రమే సమస్త మహిమ చెందాలి.
ఇస్కరియోతు యూదా పన్నెండు మంది అపొస్తలులలో ఒకడు. అతడు ఒక అభిషిక్తుడు, అతడు దెయ్యాలను వెళ్లగొట్టగలడు మరియు రోగులను స్వస్థపరచగలడు. అతడు, ఇతర అపొస్తలులు మరియు ప్రభువు శిష్యులతో కలిసి, పరిచర్య యాత్రలో బాగా ఉపయోగించబడ్డాడు. (మత్తయి 10 చదవండి)
ఏదేమైనా, యూదాలో బలహీనత ఉంది, అది స్పష్టంగా కనిపించలేదు, ఎందుకంటే అతడు దానిని బాగా మరుగుపరచగలిగాడు. యోహాను 12:6లో, పరిశుద్ధాత్మ తన బలహీనతను తెలియపరుస్తుంది. "... దొంగయై యుండి, తన దగ్గర డబ్బు సంచియుండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను."
అనేక సందర్భాల్లో, తన దగ్గరకు వచ్చిన పురుషులు మరియు స్త్రీలలో లోతైన రహస్యాలను ప్రభువు ఎలా వెల్లడి చేస్తాడో యూదా చూశాడు. ఆయన మహా కృప ద్వారా పాపులు ఎలా రక్షింపబడ్డారో కూడా అతడు చూశాడు. కానీ ఇవన్నీ తెలిసినప్పటికీ, యూదా తన స్వభావలోపాన్ని వ్యక్తిగతంగా యేసు వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. అతడు కోరుకుంటే అతడు చేసి ఉండవచ్చు మరియు అతడు బలహీనతను అధిగమించడానికి యూదా కృపను పొందాడని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను.
ప్రభువుకు కూడా దీని గురించి తెలుసు మరియు యూదా దానిని అంగీకరించాలని కోరుకున్నాడు; యూదా మారాలని ఆయన కోరుకున్నాడు, కానీ యూదా అలా చేయలేదు, చివరికి, ఇదే స్వభావ లోపం వల్ల యూదా తన యజమానిని కేవలం 30 వెండి నాణెములకు అమ్మడానికి కారణమైంది - బానిస ధర. మీరు వనరులు మరియు సంబంధాలను ఎలా నిర్వహిస్తారో అప్పుడే నిజమైన స్వభావం కనిపిస్తుంది.
మనం బలహీనులమని గుర్తించినప్పుడు మాత్రమే, మన మారుముఖమును కొనసాగించడానికి ప్రయత్నించడం మానేసి, దాని బదులుగా మన పోరాటాలకు విడుదల, స్వస్థత మరియు ఓదార్పునిచ్చే మన దేవుని సమృద్ధి మరియు క్షేమం వైపు చూడవచ్చు.
మనం ఎంత బలహీనంగా ఉన్నా లేదా హానికరముగా ఉన్నా, మన బలహీనతలను మనం ఒప్పుకుని, దేవునికి అప్పగించగలిగితే, దానిపై మనకు విజయం పొందడానికి తగిన కృప లభిస్తుందని నేను నమ్ముతున్నాను. (2 కొరింథీయులు 12:9)
ప్రార్థన
తండ్రీ, నీ కృప నా బలహీనతలో పరిపూర్ణమగుచున్నదని నేను నీకు కృతజ్ఞస్తుతలు చెల్లిస్తున్నాను. (మీ బలహీనతలను ప్రభువు వద్ద ఒప్పుకోండి). తండ్రీ, నీవు నన్ను ఎన్నడూ ఎడబాయవు మరియు నన్ను విడనాడవు అందును బట్టి నేను నీకు కృతజ్ఞస్తుతలు తెలుపుతున్నాను. యేసు నామంలో. ఆమెన్.
మూడు రోజుల ఉపవాసం & ప్రార్థనలో నాతో పాటు కలసి పాల్గొనండి
10, 11 & 12 నవంబర్ 2022
ఈ సంవత్సరం, 2022 ముగిసేలోపు, యెహోవా తన ప్రజల కొరకు గొప్ప కార్యములు చేస్తాడని నేను నమ్ముతున్నాను. దావీదులాగే, "యెహోవా నాశత్రువులను నా యెదుట నిలువకుండ నాశనము చేసెను" అని మీరు సాక్ష్యమిస్తారు. (2 సమూయేలు 5:20)
ప్రతిరోజూ ఉపవాసం యొక్క కాలపరిమానం: ఉపవాసం అర్ధరాత్రి 00:00 గంటల (12) నుండి ప్రారంభం అయి 14:00 గంటల వరకు (మధ్యాహ్నం 2) వరకు ఉంటుంది.
ఈ సమయంలో, టీ, కాఫీ లేదా ఆహారం అనుమతించబడదు. అయితే, మీరు ఎక్కువ నీరు త్రాగవచ్చు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత, మీరు సాధారణమైన ఆహారం తీసుకోవచ్చు.
1వ రోజు: ప్రార్థన గైడ్
1. ఆరాధనలో కొంత సమయం గడపండి.
2. కనీసం 15 నిమిషాలు భాషలతో ప్రార్థించండి (టైమర్ ఉంచండి)
3. "ఆశ్రయము నా కోట నేను నమ్ము కొను నా దేవుడని" నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. నిశ్చయంగా ఆయన నా కుటుంబ సభ్యులను మరియు నన్ను వేటకాని ఉరిలో నుండి మరియు నాశనకరమైన తెగులు రాకుండ రక్షించును.
4. నా ప్రార్థనలకు జవాబులను అడ్డుకునే ప్రతి శక్తి యేసు రక్తం ద్వారా నరికివేయబడును గాక.
5. యేసు నామంలో నేను నా కుటుంబ సభ్యులు మరియు నా మీద స్వేచ్ఛ, స్వస్థత, విమోచన మరియు గొప్ప కార్యములను పలుకుతున్నాను.
6. తండ్రీ, నా బలహీనతలో నీ కృప పరిపూర్ణమైనందుకు నేను నీకు కృతజ్ఞతస్తుతులు చెల్లిస్తున్నాను. (ప్రభువుతో మీ బలహీనతలను ఒప్పుకొండి). తండ్రీ, నీవు నన్ను ఏమాత్రమున విడువవు, నన్ను ఎన్నడును ఎడబాయవు అందును బట్టి నేను నీకు కృతజ్ఞతస్తుతులు చెల్లిస్తున్నాను. యేసు నామంలో. ఆమెన్.
7. ముంబైలోని షణ్ముఖానంద ఆడిటోరియంలో (ఆదివారం, నవంబర్ 13, 2022) జరిగే ఆరాధనకు వేలాది మంది తరలి రావాలని ప్రార్థించండి. వారు యేసుక్రీస్తును ప్రభువు మరియు రక్షకునిగా తెలుసుకోవాలని ప్రార్థించండి. అలాగే, వారు వారి జీవితాల్లో స్వస్థత మరియు విడుదలను మరియు అభివృద్ధిని పొందాలని ప్రార్థించండి.
మూడు రోజుల ఉపవాసం & ప్రార్థనలో నాతో పాటు కలసి పాల్గొనండి
10, 11 & 12 నవంబర్ 2022
ఈ సంవత్సరం, 2022 ముగిసేలోపు, యెహోవా తన ప్రజల కొరకు గొప్ప కార్యములు చేస్తాడని నేను నమ్ముతున్నాను. దావీదులాగే, "యెహోవా నాశత్రువులను నా యెదుట నిలువకుండ నాశనము చేసెను" అని మీరు సాక్ష్యమిస్తారు. (2 సమూయేలు 5:20)
ప్రతిరోజూ ఉపవాసం యొక్క కాలపరిమానం: ఉపవాసం అర్ధరాత్రి 00:00 గంటల (12) నుండి ప్రారంభం అయి 14:00 గంటల వరకు (మధ్యాహ్నం 2) వరకు ఉంటుంది.
ఈ సమయంలో, టీ, కాఫీ లేదా ఆహారం అనుమతించబడదు. అయితే, మీరు ఎక్కువ నీరు త్రాగవచ్చు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత, మీరు సాధారణమైన ఆహారం తీసుకోవచ్చు.
1వ రోజు: ప్రార్థన గైడ్
1. ఆరాధనలో కొంత సమయం గడపండి.
2. కనీసం 15 నిమిషాలు భాషలతో ప్రార్థించండి (టైమర్ ఉంచండి)
3. "ఆశ్రయము నా కోట నేను నమ్ము కొను నా దేవుడని" నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. నిశ్చయంగా ఆయన నా కుటుంబ సభ్యులను మరియు నన్ను వేటకాని ఉరిలో నుండి మరియు నాశనకరమైన తెగులు రాకుండ రక్షించును.
4. నా ప్రార్థనలకు జవాబులను అడ్డుకునే ప్రతి శక్తి యేసు రక్తం ద్వారా నరికివేయబడును గాక.
5. యేసు నామంలో నేను నా కుటుంబ సభ్యులు మరియు నా మీద స్వేచ్ఛ, స్వస్థత, విమోచన మరియు గొప్ప కార్యములను పలుకుతున్నాను.
6. తండ్రీ, నా బలహీనతలో నీ కృప పరిపూర్ణమైనందుకు నేను నీకు కృతజ్ఞతస్తుతులు చెల్లిస్తున్నాను. (ప్రభువుతో మీ బలహీనతలను ఒప్పుకొండి). తండ్రీ, నీవు నన్ను ఏమాత్రమున విడువవు, నన్ను ఎన్నడును ఎడబాయవు అందును బట్టి నేను నీకు కృతజ్ఞతస్తుతులు చెల్లిస్తున్నాను. యేసు నామంలో. ఆమెన్.
7. ముంబైలోని షణ్ముఖానంద ఆడిటోరియంలో (ఆదివారం, నవంబర్ 13, 2022) జరిగే ఆరాధనకు వేలాది మంది తరలి రావాలని ప్రార్థించండి. వారు యేసుక్రీస్తును ప్రభువు మరియు రక్షకునిగా తెలుసుకోవాలని ప్రార్థించండి. అలాగే, వారు వారి జీవితాల్లో స్వస్థత మరియు విడుదలను మరియు అభివృద్ధిని పొందాలని ప్రార్థించండి.
Most Read
● అప్పు ఊబి నుండి బయటపడండి: తాళంచెవి # 2● యెహోవాకు మొఱ్ఱపెట్టము
● 20 రోజు: 21 రోజుల ఉపవాసం & ప్రార్థన
● కృప యొక్క వరము (బహుమతి)
● దేనికి కాదు డబ్బు
● సమర్థవంతమైన 40 రోజుల ఉపవాసం కోసం మార్గదర్శకత్వం
● నాయకుడి పతనం కారణంగా మనం నిష్క్రమించాలా (ఓడిపోవాలా)?
కమెంట్లు