న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరవు కలుగగా (రూతు 1:1)
ఇశ్రాయేలీయులు తన వాక్యానికి విధేయులైతే వాగ్దాన దేశంలో ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉంటుందని ప్రభువు వారికి ప్రత్యేకంగా వాగ్దానం చేశాడు. కాబట్టి, దేశంలో కరువు అంటే ఇశ్రాయేలు ఒక దేశంగా ప్రభువుకు విధేయత చూపలేదు (ద్వితీయోపదేశకాండము 11:13-17).
కాబట్టి, కరువు కారణంగా ఎలీమెలెకు అతని భార్య నయోమి మరియు కుటుంబం మోయాబు దేశానికి తరలివెళ్లారు. అయినప్పటికీ, తన ప్రజలకు ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించాడనే శుభవార్త నయోమి విన్నప్పుడు, ఆమె మోయాబు (శపించబడిన దేశం) నుండి బేత్లెహేముకు వెళ్లాలని నిర్ణయించుకుంది.
అరబిక్ భాషలో బేత్లెహేము అంటే "మాంసపు ఇల్లు."
హీబ్రూ భాషలో బేత్లెహేము అంటే "ధాన్యపు ఇల్లు."
"యోసేపు ఇంక బ్రదికియుండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని" యాకోబుకు తెలియచేసిరి. అయితే యాకోబు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయెను. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటిని అతనితో చెప్పిరి. అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచి నప్పుడు వారి తండ్రియైన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. (ఆదికాండము 45:26-27)
యోసేపు (అతని కుమారుడు) జీవించి ఉన్నాడని మరియు ఐగుప్తు దేశమంతటికి అధిపతిగా ఉన్నాడని యాకోబు కుమారులు చెప్పినప్పుడు, అతను విన్న దానిని నమ్మలేకపోయాడు. ఇది నిజం కావడం చాలా బాగుంది. అయితే, వారు యోసేపు మరియు యాకోబు చెప్పిన మాటలను అతనికి చెప్పినప్పుడు, యోసేపు పంపిన మంచి వస్తువులతో బండ్లు నింపబడి ఉండటం చూసి, అతడు మంచి శుభవార్త సందేశాన్ని నమ్మాడు.
అదే విధంగా, మనం యూదులకు మరియు అన్యజనులకు సువార్తను (సువార్తను) ప్రకటించినప్పుడు, వారికి చాలా వ్యక్తిగతమైన మరియు వారితో మాట్లాడే సందేశాన్ని మనం ప్రకటించాలి. అలాగే, వారు తప్పక చూసి మరియు విని దీవెనలను అనుభవించాలి. అప్పుడే కుంగిపోయిన వారి మనోభావాలు మళ్లీ పునావృతం అవుతాయి. అదే సువార్త యొక్క శక్తి.
మీరు నిరంతరం ఏలాంటి వార్తలను వింటున్నారు?
ఎవరైనా మీ దగ్గరకు వచ్చి, "ఈ వ్యక్తి మీ గురించి ఏమి చెప్పాడో దాని గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను" అని చెప్పితే. చాలా వందనాలు అండి; నేను తరువాత మీతో మాట్లాడుతాను" అని చెప్పండి. మీ గురించి ఈయన చెప్పినవి, ఆయన చెప్పినవి వినాలనే కోరిక మీకు ఉంటే, మీలో అభద్రతాభావం ఉందని అర్థం. క్రీస్తులో మీ గుర్తింపులో మీరు సురక్షితంగా ఉండాలి. కాబట్టి అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండండి, లేదా వారు మీకు చెప్పే చెడు వార్తలు మిమ్మల్ని కోపానికి మరియు నిరాశకు గురిచేస్తాయి. అంతిమంగా, అది మిమ్మల్ని దేవుని నుండి దూరం చేస్తుంది.
రెండవదిగా, మీ నోటి నుండి ఏలాంటి పదాలు వస్తున్నాయి?
మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేను మాట్లాడబోయే మాటలు, అవి బంధాన్ని ఏర్పరుస్తాయా లేదా నాశనం చేస్తాయా. మీరు మీ మాటలలో అజాగ్రత్తగా ఉంటే, అది పరిపక్వత లోపాన్ని స్పష్టంగా చూపిస్తుంది. జీవ మరణములు నాలుక వశములో ఉన్నాయని బైబిలు స్పష్టంగా తెలియజేస్తుంది. (సామెతలు 18:21) ముచ్చట్లు (గుసగుసలాడేవారిగా) చెప్పేవారిగా ఉండకండి.
ఒక నిర్ణయం తీసుకుని, "నేను సువార్తను మోసుకెళ్ళేవాడిని. నేను మాట్లాడే మాటలు ప్రజలను పైకి లేవనెత్తుతాయి మరియు వారిని అణచివేయవు. నా నాలుక ప్రాణాన్ని ఇచ్చే జీవపు ఊట" అని ఒప్పుకుంటూ పలకండి.
గుర్తుంచుకోండి, మన ప్రభువైన యేసు క్రీస్తు సువార్త మంచి శుభవార్త, మరియు ఈ సువార్తను లోకమంతటా ప్రకటించడానికి మీరు పిలువబడ్డారు. నేను పంచుకున్న దాని ప్రకారం మీరు నడుచుకుంటే, దేశాలను ఆశీర్వదించడానికి ప్రభువు మిమ్మల్ని ఉపయోగించుకుంటాడు.
ఒప్పుకోలు
నేను నా నోటి నుండి వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధి కరమైన అనుకూల వచనమే పలుకుతాను గాని దుర్భాష యేదైనను నా నోట నుండి రానియ్యను. (ఎఫెసీయులకు 4:29)
Join our WhatsApp Channel

Most Read
● వాతావరణం మీద కీలకమైన అంతర్దృష్టులు (పరిజ్ఞానం) - 3● యుద్ధం కోసం శిక్షణ - II
● విశ్వాసులైన రాజుల యాజకులు
● జీవితపు హెచ్చరికలను పాటించడం
● తగినంత కంటే అత్యధికముగా అద్భుతాలు చేసే దేవుడు
● రక్తంలోనే ప్రాణము ఉంది
● పరిపక్వత బాధ్యతతో మొదలవుతుంది
కమెంట్లు