వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలె ననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. 2 దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి యొక పట్టణములో ఉండెను. 3 ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచు వచ్చెను గాని 4 అతడు కొంతకాలము ఒప్పక పోయెను. తరువాత అతడు-నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు ఉండినను 5 ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాననుకొనెను. 6 మరియు ప్రభువిట్లనెను అన్యాయస్థుడైన ఆ న్యాయాధి పతి చెప్పిన మాట వినుడి. 7 దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్నుగూర్చి మొఱ్ఱపెట్టుకొను చుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును; వారినిషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను.(లూకా 18:1-7)
1. మొదటగా, స్త్రీ అపరిచితురాలు, అయితే మనం దేవుని పిల్లలం, దేవుడు తన పిల్లల పట్ల శ్రద్ధ వహిస్తాడు (లూకా 11:13).
2. విధవరాలుకు న్యాయాధిపతి యొద్దకు వెళ్ళడానికి అవకాశం లేదు, కానీ దేవుని పిల్లలకు ఆయన సన్నిధిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది మరియు వారికి అవసరమైన సహాయం పొందడానికి ఏ సమయమైనా వెళ్ళవచ్చు (ఎఫెసీయులకు 2:18; 3:12; హెబ్రీయులకు 10:19-22).
గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము. (హెబ్రీయులకు 4:16)
యెహోవా మోషేతో ఇట్లనెను: "నేను కరుణా పీఠము మీద మేఘ ములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావక యుండునట్లు అతడు మందసము మీది కరుణా పీఠము ఎదుటనున్న అడ్డతెరలోపలికి ఎల్లప్పుడును రాకూడదని అతనితో చెప్పుము. (లేవీయకాండము 16:2)
నేడు, యేసు యొక్క పరిపూర్ణ ప్రాయశ్చిత్త త్యాగం కారణంగా, పాత నిబంధనలోని అహరోను వలె కాకుండా మనం ఎప్పుడైనా దేవుని సన్నిధికి రావచ్చు.
3. స్త్రీకి కోర్టులో తన కేసును పరిష్కరించడంలో సహాయపడటానికి స్నేహితులెవ్వరూ లేరు. ఆమె చేయగలిగిందల్లా కోర్ట్ వెలుపల తిరుగుతూ, న్యాయాధిపతి మీద అరిచి తనకు తాను ఇబ్బందిలో పడింది. కానీ క్రైస్తవ విశ్వాసులు ప్రార్థన చేసినప్పుడు, వారికి పరలోకంలో రక్షకుడైన ఉత్తరవాది (1 యోహాను 2:1) మరియు ప్రధాన యాజకుడు (హెబ్రీ 2:17-18) ఉన్నాడు, ఆయన నిరంతరం దేవుని సింహాసనం ముందు వారికి ప్రాతినిధ్యం వహిస్తాడు.
4. ఈరోజు, మనం ప్రార్థించేటప్పుడు, మనం వాక్యాన్ని తెరిచి, దేవుని యొక్క అనేక వాగ్దానాలను పొందుకోవచ్చు, కానీ విధవరాలు తన సమస్యను వినడానికి న్యాయాధిపతి ఒప్పించడానికి ప్రయత్నించినప్పుడు ఆమె యొద్ద పొందుకోగలిగే వాగ్దానాలు లేవు. మనకు దేవుని యొక్క విఫలమైన వాగ్దానాలు మాత్రమే కాకుండా, మన ప్రార్థనలో మనకు సహాయం చేసే పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడు (రోమీయులకు 8:26-27).
పట్టుదల కూడా ఒక కారణం విధవరాలుకి ఆమెకు జవాబు తెచ్చి పెట్టింది. ప్రార్థనలో పట్టుదల అనేది దేవుని ఆధారము చేసుకోవడం. యెషయా 64:7 మనకు తెలియజేస్తుంది, "నీ నామమును బట్టి మొఱ్ఱపెట్టు వాడొకడును లేక పోయెను నిన్ను ఆధారము చేసికొనుటకై తన్నుతాను ప్రోత్సాహపరచు కొనువాడొకడును లేడు."
ప్రార్థనలో దేవుణ్ణి ఆధారము చేసుకునే వారు చాలా తక్కువ అని పై వచనం సూచిస్తుంది. నిరంతర ప్రార్థన యొక్క లక్షణాలలో ఒకటి "దేవుని ఆధారము చేసికొనుటకై తన్నుతాను ప్రోత్సాహపరచుకోవడం".
మీరు ఆయనను వెతుకుతు ఫలితాలను చూసే వరకు వెనకడుగు వేయకుండా, దేవుణ్ణి ఆధారము చేసికొనుటకై తనను తాను ప్రోత్సాహపరచుకునే వారిలో మీరు ఒకరిగా ఉంటారా?
నిరంతర ప్రార్థనకు ఉదాహరణలు
1. యాకోబు (ఆదికాండము 32:22-28)
యాకోబు ఇరవై సంవత్సరాల క్రితం మోసం చేసిన తన సహోదరుడు ఏశావును ఎదుర్కోవడానికి ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. ఏశావును మళ్లీ చూడాలనే అతని భయం మరియు ఆత్రుత దేవుడు అతన్ని దీవించే వరకు ప్రార్థనలో దేవునితో యుద్ధం చేసేలా చేసింది.
2. గ్రుడ్డివాడు
ఆ గ్రుడ్డివాడు కేవలం చూడాలనుకున్నాడు (లూకా 18:35-43). అతడు యేసయ్యను చూచి కరుణించమని కేకలు వేసెను, జనసమూహములు అతనిని ఊరకుండుమని గద్దించిరి, కాని అతడు మరియెక్కువగా కేకలు వేసెను.
మనం మన ఆధ్యాత్మిక కన్నుల కోసం ప్రార్థించవచ్చు. కీర్తనకారుడు ఇలా మొఱ్ఱపెట్టాడు, "నేను నీ ధర్మశాస్త్రము నందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము" (కీర్తనలు 119:18). ఇతరుల కొరకు, సువార్తకు ప్రత్యక్షంగా వ్యతిరేకిస్తున్న వారి కొరకు కూడా ఆధ్యాత్మిక కన్నులు పొందాలని మనం ప్రార్థించవచ్చు.
3. సురోఫెనికయ స్త్రీ
ఒక సురోఫెనికయ స్త్రీ, తన కుమార్తె అపవిత్రాత్మచే పీడించబడింది, "వెంటనే వచ్చి ఆయన పాదములమీద పడెను" మరియు "ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్లగొట్టుమని ఆయనను వేడుకొనెను." (మార్కు 7:25-30). ఈ స్త్రీ నిరాశ మరియు పట్టుదలతో ఉంది.
మనం, మన ప్రియమైనవారు మరియు విముక్తి అవసరమైన వారందరూ విడుదల పొందే వరకు ఆయనను ఆధారము చేసుకొందాం.
4. అర్ధరాత్రి ఒక స్నేహితుడు ఒక రొట్టె కోసం అభ్యర్థిస్తున్నాడు (లూకా 11:5-10)
ఇక్కడ విషయం ఏమిటంటే, అడుగుడి మరియు అడుగుతూ ఉండండి, వెదకుడి మరియు వెదుకుతూ ఉండండి మరియు తట్టుడి మరియు తట్టుతూ ఉండండి. పట్టుదలతో ఉండండి మరియు మీకు అవసరమైన వాటిని పొందే వరకు వెనకడుగు వేయదు.
a. ఇతరుల అవసరాల కోసం ప్రార్థించడం
వారి అవసరాలు తీరే వరకు నిరంతర ప్రార్థనలో దేవుణ్ణి ఆధారము చేసుకునే విజ్ఞాపన ప్రార్థన యోధులు మనకు అవసరం. అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు, "కక్ష చేతనైనను వృథాతిశయము చేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక యితరుల కార్యములను కూడ చూడవలెను" (ఫిలిప్పీయులకు 2:3-4).
బి. పరిశుద్ధాత్మతో నింపబడటం లేదా బాప్తిస్మము పొందడం
పరిశుద్ధాత్మను వేడుకునే సందర్భం ఇక్కడ మనకు తెలియజేస్తుంది. యేసు ప్రభువు ఇలా అన్నాడు, "మీలో తండ్రియైన వాడు తన కుమారుడు చేప నడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డు నడిగితే తేలు నిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారై యుండియు, మీ పిల్లలకు మంచి యీవులనియ్య నెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును." (లూకా 11:11-13)?
ఆత్మతో నింపబడటం లేదా బాప్తిస్మము పొందడం కోసం వెతుకుతున్నప్పుడు, మనం ఆయన యొద్దకు వచ్చి అన్ని పొందే వరకు మనం అడుగుతూ, వెదుకుతూ మరియు తట్టుతూ ఉండాలి.
5. ఏలీయా
ఇశ్రాయేలు పశ్చాత్తాపపడిన తర్వాత, దేవుడు వర్షం కురిపిస్తాడని ఏలీయాకు తెలుసు. అతడు తన ప్రార్థనలలో దైవికంగా నిర్దేశించబడ్డాడు (1 యోహాను 5:14-15). అతడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు మరియు వర్షం కురిసే సూచన కోసం తన సేవకుని పంపాడు. అతడు తన సేవకుడు తిరిగి వచ్చే వరకు ఏడుసార్లు ఇలా చేసాడు, "అదిగో మనిషి చెయ్యి యంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను" (1 రాజులు 18:44).
అతనికి కావలసింది అంతే, దేవుడు తన ప్రార్థనకు జవాబిచ్చాడని అతనికి తెలుసు. సమాధానం వచ్చే వరకు అతడు పట్టుదలతో ఉన్నాడు. ఇది దేవుని చిత్తమని మనకు తెలిసినప్పుడు, ఆయన ఉద్దేశాలు నెరవేరే వరకు మనం పట్టుదలతో ప్రార్థించాలి.
అయినను మనుష్య కుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? (లూకా 18:8)
ప్రభువు మరల వచ్చినప్పుడు, చాలా మందిలో బలమైన ప్రార్థన జీవితం ఉండదని ఇది సూచిస్తుంది. ప్రార్థన చేయకపోవడం అంత్య దినాల యొక్క మరొక సూచన.
9 తామే నీతి మంతులని తమ్ము నమ్ముకొని యితరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. 10 ప్రార్థన చేయుటకై యిద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్లిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. 11 పరిసయ్యుడు నిలువబడి దేవా, నేను చోరులును అన్యాయస్థులును వ్యభిచారులునైన యితర మనుష్యులవలెనైనను, ఈ సుంకరివలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 12 వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించు చుండెను. 13 అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశమువైపు కన్ను లెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. 14 అతనికంటె ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన యింటికి వెళ్లెనని మీతో చెప్పుచున్నాను.
'దేవా, నేను ఇతర యితర మనుష్యులవలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
అతడు తన స్వభావం దేవుని పరిశుద్ధ స్వభావాన్ని బట్టి కాదు, ఇతర మనుష్యులవలె స్వభావాన్ని బట్టి నిర్ణయిస్తున్నాడు. ఎప్పుడైతే మీరు మీ స్వభావమును దేవుని పరిశుద్ధ స్వభావాన్ని బట్టి కాక, ఇతర మనుష్యుల స్వభావాన్ని బట్టి అంచనా వేస్తారో, మీరు గర్వంగా (అహంకారముతో) నడుచుకుంటారు.
పరిసయ్యుడు 'సంతృప్తిగా' ఇంటికి వెళ్ళాడు, కానీ సుంకరి 'నీతిమంతుడుగా తీర్చబడి' ఇంటికి వెళ్ళాడు
వ్యక్తిగత సంతృప్తి మాత్రమే. సిలువ మీద యేసుక్రీస్తు చేసిన బలి ఆధారంగా దేవునిచే నీతిమంతునిగా ప్రకటించబడడం అంటే "నీతిమంతుడుగా తీర్చబడటం" అని అర్థం (రోమీయులకు 3:19—4:25).
పరిసయ్యుడు మరియు సుంకరి ఇద్దరు గొప్ప వర్గముల వారిని సూచిస్తున్నారు, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన వారీగా విభజించబడ్డారు. వారి మొదటి ఇద్దరు ప్రతినిధులు లోకంలో జన్మించిన మొదటి ఇద్దరు పిల్లలలో కనిపిస్తున్నారు- కయీను మరియు హేబెలు.
కయీను కూరగాయల అర్పణముతో దేవుని వద్దకు వచ్చాడు, పాపములను ఒప్పుకోలేదని సూచిస్తుంది మరియు కృప అవసరం లేదని తెలియజేస్తుంది. కానీ హేబెలు దేవుని గొఱ్ఱెపిల్లకు సూచించే రక్తంతో వచ్చాడు-తనకు పరిశుద్ధ దేవుని నుండి కృప అవసరమని తనకు తాను సూచించాడు. లేఖనం సెలవిస్తుంది, ప్రభువు హేబెలు అర్పణను ఘనపరిచాడు.
"తన్ను తాను హెచ్చించుకునే ప్రతి ఒక్కరూ ఒకరోజు అందరి యెదుట అవమానించబడతారు మరియు తన్ను తాను తగ్గించుకునే ప్రతి ఒక్కరూ ఒక రోజు అందరి ఎదుట హెచ్చింపబడుతారు మరియు ఘనత చెందుతారు."
"తన్ను తాను హెచ్చించు కొనువాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును."
ఒకసారి నన్ను ఒక సభకు వక్తగా ఆహ్వానించారు. నేను మాట్లాడటానికి ముందు, ఒక పాస్టర్ గారు ప్రార్థన చేయమని అడిగారు. ఆయన ప్రార్థన ప్రారంభించాడు. "ప్రభువా మాపై దయ చూపు, మేమంతా గాడిదలం, నీ ముందు మేమంతా కుక్కలమే ప్రభువా, మేమంతా మురికి పురుగులం ప్రభువా" అంటూ తనని తాను దిగజార్చుకుంటూ వెళ్ళిపోయాడు (తెలియకుండా స్టేజి మీద ఉన్న మమ్మల్ని కూడా). సభ ముగిసిన తరువాత, నేను అతనిని కలవడం మరియు అతనితో మాట్లాడటం నిశ్చయించుకున్నాను. కొంతమంది ప్రార్థనలో తమను తాము దిగజార్చుకోవడం ద్వారా తమను తాము తగ్గించుకుంటున్నారని అనుకుంటారు. ఇక్కడ లేఖనాలు ఈ విధంగా చెప్పడం లేదు. నేను మీకు చెప్తాను: క్రీస్తు యేసు తన అమూల్యమైన రక్తాన్ని మీ కొరకు చిందించిన వ్యక్తి మీరు, మరియు మిమ్మల్ని మీరు దిగజార్చుకోవడం ద్వారా, మీరు ఖచ్చితంగా దేవుణ్ణి మహిమపరచడం లేదు. దానే తప్పుడు తగ్గించుకోవడం అంటారు.
తన్ను తాను తగ్గించుకోవడమంటే అన్నిటికంటే ఎక్కువగా దేవునికి మన అవసరాన్ని గుర్తించడమే.
అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి, "చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియ్యుడి, దేవుని రాజ్యము ఇలాంటి వారిది." (లూకా 18:16)
పిల్లల పరిచర్యకు పునాది లేఖనము
"చిన్న బిడ్డవలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను." (లూకా 18:17)
మనం చిన్నపిల్లలలాగా ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు కానీ పిల్లవానిగా కాదు.
దీన్ని బాగా నేర్చుకోండి: ఒక చిన్న పిల్లవాడు పొందుకునే విధంగానే మీరు దేవుని రాజ్యం యొక్క ప్రత్యక్షతను పొందకపోతే, మీరు ఎన్నటికీ ప్రవేశించలేరు." (లూకా 18:17 TPT)
ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని? ఆయన నడిగెను. (లూకా 18:18)
అతను సరైన వ్యక్తి వద్దకు వచ్చినప్పటికీ, సరైన ప్రశ్న అడిగాడు మరియు సరైన సమాధానం పొందుకున్నప్పటికీ, అతడు తప్పు నిర్ణయం తీసుకున్నాడు. మీరు మీతో నిజాయితీగా లేనప్పుడు, మీరు దానిని ఎలా చేయగలరు?.
అందుకు యేసు, నేను సత్పురుషుడనని యేల చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. (లూకా 18:19)
రబ్బీలను బోధకులు అని అంటారు, కానీ రబ్బీని "సత్పురుషుడు" అని పిలవడం చాలా అసాధారణమైనది. యూదులు దేవునికి సత్పురుషుడు అనే పదాన్ని కేటాయించారు (కీర్తనాలు 25:8; 34:8; 86:5; 106:1). మన ప్రభువు ఆ అధికారి తన ఉద్దేశ్యం ఏమిటని ఎందుకు అడిగాడో ఇది తెలియజేస్తుంది, ఎందుకంటే అతడు నిజంగా యేసు "సత్పురుషుడు" అని విశ్వసిస్తే, అతడు యేసు దేవుడని ఒప్పుకోవలసి ఉంటుంది.
ఈ ప్రశ్న అడగడం ద్వారా, మన ప్రభువు తన దైవత్వమును తిరస్కరించలేదు, దానిని ధృవీకరించాడు. ఆయన ఇప్పుడే చెప్పినది నిజంగా అర్థం చేసుకున్నాడా లేదా అని అధికారిని పరీక్షిస్తున్నాడు. మనం ఏ ఉద్దేశ్యం లేనిది చెప్పే సందర్భాలు చాలా ఉన్నాయి - అదే ముఖస్తుతి.
రక్షణానికి సాధనంగా యేసు అతనికి ధర్మశాస్త్రాన్ని యథాతథంగా చెప్పలేదు
ఎందుకంటే ధర్మశాస్త్రానికి విధేయత చూపడం వల్ల మనం రక్షించబడం. ఆయన తన పాపాలను బహిర్గతం చేయడానికి ఆ అధికారి ముందు ధర్మశాస్త్రాన్ని అద్దంలా ఉంచాడు (రోమీయులకు 3:19-20; గలతీయులకు 2:21; 3:21).
1. మొదటగా, స్త్రీ అపరిచితురాలు, అయితే మనం దేవుని పిల్లలం, దేవుడు తన పిల్లల పట్ల శ్రద్ధ వహిస్తాడు (లూకా 11:13).
2. విధవరాలుకు న్యాయాధిపతి యొద్దకు వెళ్ళడానికి అవకాశం లేదు, కానీ దేవుని పిల్లలకు ఆయన సన్నిధిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది మరియు వారికి అవసరమైన సహాయం పొందడానికి ఏ సమయమైనా వెళ్ళవచ్చు (ఎఫెసీయులకు 2:18; 3:12; హెబ్రీయులకు 10:19-22).
గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము. (హెబ్రీయులకు 4:16)
యెహోవా మోషేతో ఇట్లనెను: "నేను కరుణా పీఠము మీద మేఘ ములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావక యుండునట్లు అతడు మందసము మీది కరుణా పీఠము ఎదుటనున్న అడ్డతెరలోపలికి ఎల్లప్పుడును రాకూడదని అతనితో చెప్పుము. (లేవీయకాండము 16:2)
నేడు, యేసు యొక్క పరిపూర్ణ ప్రాయశ్చిత్త త్యాగం కారణంగా, పాత నిబంధనలోని అహరోను వలె కాకుండా మనం ఎప్పుడైనా దేవుని సన్నిధికి రావచ్చు.
3. స్త్రీకి కోర్టులో తన కేసును పరిష్కరించడంలో సహాయపడటానికి స్నేహితులెవ్వరూ లేరు. ఆమె చేయగలిగిందల్లా కోర్ట్ వెలుపల తిరుగుతూ, న్యాయాధిపతి మీద అరిచి తనకు తాను ఇబ్బందిలో పడింది. కానీ క్రైస్తవ విశ్వాసులు ప్రార్థన చేసినప్పుడు, వారికి పరలోకంలో రక్షకుడైన ఉత్తరవాది (1 యోహాను 2:1) మరియు ప్రధాన యాజకుడు (హెబ్రీ 2:17-18) ఉన్నాడు, ఆయన నిరంతరం దేవుని సింహాసనం ముందు వారికి ప్రాతినిధ్యం వహిస్తాడు.
4. ఈరోజు, మనం ప్రార్థించేటప్పుడు, మనం వాక్యాన్ని తెరిచి, దేవుని యొక్క అనేక వాగ్దానాలను పొందుకోవచ్చు, కానీ విధవరాలు తన సమస్యను వినడానికి న్యాయాధిపతి ఒప్పించడానికి ప్రయత్నించినప్పుడు ఆమె యొద్ద పొందుకోగలిగే వాగ్దానాలు లేవు. మనకు దేవుని యొక్క విఫలమైన వాగ్దానాలు మాత్రమే కాకుండా, మన ప్రార్థనలో మనకు సహాయం చేసే పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడు (రోమీయులకు 8:26-27).
పట్టుదల కూడా ఒక కారణం విధవరాలుకి ఆమెకు జవాబు తెచ్చి పెట్టింది. ప్రార్థనలో పట్టుదల అనేది దేవుని ఆధారము చేసుకోవడం. యెషయా 64:7 మనకు తెలియజేస్తుంది, "నీ నామమును బట్టి మొఱ్ఱపెట్టు వాడొకడును లేక పోయెను నిన్ను ఆధారము చేసికొనుటకై తన్నుతాను ప్రోత్సాహపరచు కొనువాడొకడును లేడు."
ప్రార్థనలో దేవుణ్ణి ఆధారము చేసుకునే వారు చాలా తక్కువ అని పై వచనం సూచిస్తుంది. నిరంతర ప్రార్థన యొక్క లక్షణాలలో ఒకటి "దేవుని ఆధారము చేసికొనుటకై తన్నుతాను ప్రోత్సాహపరచుకోవడం".
మీరు ఆయనను వెతుకుతు ఫలితాలను చూసే వరకు వెనకడుగు వేయకుండా, దేవుణ్ణి ఆధారము చేసికొనుటకై తనను తాను ప్రోత్సాహపరచుకునే వారిలో మీరు ఒకరిగా ఉంటారా?
నిరంతర ప్రార్థనకు ఉదాహరణలు
1. యాకోబు (ఆదికాండము 32:22-28)
యాకోబు ఇరవై సంవత్సరాల క్రితం మోసం చేసిన తన సహోదరుడు ఏశావును ఎదుర్కోవడానికి ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. ఏశావును మళ్లీ చూడాలనే అతని భయం మరియు ఆత్రుత దేవుడు అతన్ని దీవించే వరకు ప్రార్థనలో దేవునితో యుద్ధం చేసేలా చేసింది.
2. గ్రుడ్డివాడు
ఆ గ్రుడ్డివాడు కేవలం చూడాలనుకున్నాడు (లూకా 18:35-43). అతడు యేసయ్యను చూచి కరుణించమని కేకలు వేసెను, జనసమూహములు అతనిని ఊరకుండుమని గద్దించిరి, కాని అతడు మరియెక్కువగా కేకలు వేసెను.
మనం మన ఆధ్యాత్మిక కన్నుల కోసం ప్రార్థించవచ్చు. కీర్తనకారుడు ఇలా మొఱ్ఱపెట్టాడు, "నేను నీ ధర్మశాస్త్రము నందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము" (కీర్తనలు 119:18). ఇతరుల కొరకు, సువార్తకు ప్రత్యక్షంగా వ్యతిరేకిస్తున్న వారి కొరకు కూడా ఆధ్యాత్మిక కన్నులు పొందాలని మనం ప్రార్థించవచ్చు.
3. సురోఫెనికయ స్త్రీ
ఒక సురోఫెనికయ స్త్రీ, తన కుమార్తె అపవిత్రాత్మచే పీడించబడింది, "వెంటనే వచ్చి ఆయన పాదములమీద పడెను" మరియు "ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్లగొట్టుమని ఆయనను వేడుకొనెను." (మార్కు 7:25-30). ఈ స్త్రీ నిరాశ మరియు పట్టుదలతో ఉంది.
మనం, మన ప్రియమైనవారు మరియు విముక్తి అవసరమైన వారందరూ విడుదల పొందే వరకు ఆయనను ఆధారము చేసుకొందాం.
4. అర్ధరాత్రి ఒక స్నేహితుడు ఒక రొట్టె కోసం అభ్యర్థిస్తున్నాడు (లూకా 11:5-10)
ఇక్కడ విషయం ఏమిటంటే, అడుగుడి మరియు అడుగుతూ ఉండండి, వెదకుడి మరియు వెదుకుతూ ఉండండి మరియు తట్టుడి మరియు తట్టుతూ ఉండండి. పట్టుదలతో ఉండండి మరియు మీకు అవసరమైన వాటిని పొందే వరకు వెనకడుగు వేయదు.
a. ఇతరుల అవసరాల కోసం ప్రార్థించడం
వారి అవసరాలు తీరే వరకు నిరంతర ప్రార్థనలో దేవుణ్ణి ఆధారము చేసుకునే విజ్ఞాపన ప్రార్థన యోధులు మనకు అవసరం. అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు, "కక్ష చేతనైనను వృథాతిశయము చేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక యితరుల కార్యములను కూడ చూడవలెను" (ఫిలిప్పీయులకు 2:3-4).
బి. పరిశుద్ధాత్మతో నింపబడటం లేదా బాప్తిస్మము పొందడం
పరిశుద్ధాత్మను వేడుకునే సందర్భం ఇక్కడ మనకు తెలియజేస్తుంది. యేసు ప్రభువు ఇలా అన్నాడు, "మీలో తండ్రియైన వాడు తన కుమారుడు చేప నడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డు నడిగితే తేలు నిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారై యుండియు, మీ పిల్లలకు మంచి యీవులనియ్య నెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును." (లూకా 11:11-13)?
ఆత్మతో నింపబడటం లేదా బాప్తిస్మము పొందడం కోసం వెతుకుతున్నప్పుడు, మనం ఆయన యొద్దకు వచ్చి అన్ని పొందే వరకు మనం అడుగుతూ, వెదుకుతూ మరియు తట్టుతూ ఉండాలి.
5. ఏలీయా
ఇశ్రాయేలు పశ్చాత్తాపపడిన తర్వాత, దేవుడు వర్షం కురిపిస్తాడని ఏలీయాకు తెలుసు. అతడు తన ప్రార్థనలలో దైవికంగా నిర్దేశించబడ్డాడు (1 యోహాను 5:14-15). అతడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు మరియు వర్షం కురిసే సూచన కోసం తన సేవకుని పంపాడు. అతడు తన సేవకుడు తిరిగి వచ్చే వరకు ఏడుసార్లు ఇలా చేసాడు, "అదిగో మనిషి చెయ్యి యంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను" (1 రాజులు 18:44).
అతనికి కావలసింది అంతే, దేవుడు తన ప్రార్థనకు జవాబిచ్చాడని అతనికి తెలుసు. సమాధానం వచ్చే వరకు అతడు పట్టుదలతో ఉన్నాడు. ఇది దేవుని చిత్తమని మనకు తెలిసినప్పుడు, ఆయన ఉద్దేశాలు నెరవేరే వరకు మనం పట్టుదలతో ప్రార్థించాలి.
అయినను మనుష్య కుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? (లూకా 18:8)
ప్రభువు మరల వచ్చినప్పుడు, చాలా మందిలో బలమైన ప్రార్థన జీవితం ఉండదని ఇది సూచిస్తుంది. ప్రార్థన చేయకపోవడం అంత్య దినాల యొక్క మరొక సూచన.
9 తామే నీతి మంతులని తమ్ము నమ్ముకొని యితరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. 10 ప్రార్థన చేయుటకై యిద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్లిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. 11 పరిసయ్యుడు నిలువబడి దేవా, నేను చోరులును అన్యాయస్థులును వ్యభిచారులునైన యితర మనుష్యులవలెనైనను, ఈ సుంకరివలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 12 వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించు చుండెను. 13 అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశమువైపు కన్ను లెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. 14 అతనికంటె ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన యింటికి వెళ్లెనని మీతో చెప్పుచున్నాను.
'దేవా, నేను ఇతర యితర మనుష్యులవలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
అతడు తన స్వభావం దేవుని పరిశుద్ధ స్వభావాన్ని బట్టి కాదు, ఇతర మనుష్యులవలె స్వభావాన్ని బట్టి నిర్ణయిస్తున్నాడు. ఎప్పుడైతే మీరు మీ స్వభావమును దేవుని పరిశుద్ధ స్వభావాన్ని బట్టి కాక, ఇతర మనుష్యుల స్వభావాన్ని బట్టి అంచనా వేస్తారో, మీరు గర్వంగా (అహంకారముతో) నడుచుకుంటారు.
పరిసయ్యుడు 'సంతృప్తిగా' ఇంటికి వెళ్ళాడు, కానీ సుంకరి 'నీతిమంతుడుగా తీర్చబడి' ఇంటికి వెళ్ళాడు
వ్యక్తిగత సంతృప్తి మాత్రమే. సిలువ మీద యేసుక్రీస్తు చేసిన బలి ఆధారంగా దేవునిచే నీతిమంతునిగా ప్రకటించబడడం అంటే "నీతిమంతుడుగా తీర్చబడటం" అని అర్థం (రోమీయులకు 3:19—4:25).
పరిసయ్యుడు మరియు సుంకరి ఇద్దరు గొప్ప వర్గముల వారిని సూచిస్తున్నారు, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన వారీగా విభజించబడ్డారు. వారి మొదటి ఇద్దరు ప్రతినిధులు లోకంలో జన్మించిన మొదటి ఇద్దరు పిల్లలలో కనిపిస్తున్నారు- కయీను మరియు హేబెలు.
కయీను కూరగాయల అర్పణముతో దేవుని వద్దకు వచ్చాడు, పాపములను ఒప్పుకోలేదని సూచిస్తుంది మరియు కృప అవసరం లేదని తెలియజేస్తుంది. కానీ హేబెలు దేవుని గొఱ్ఱెపిల్లకు సూచించే రక్తంతో వచ్చాడు-తనకు పరిశుద్ధ దేవుని నుండి కృప అవసరమని తనకు తాను సూచించాడు. లేఖనం సెలవిస్తుంది, ప్రభువు హేబెలు అర్పణను ఘనపరిచాడు.
"తన్ను తాను హెచ్చించుకునే ప్రతి ఒక్కరూ ఒకరోజు అందరి యెదుట అవమానించబడతారు మరియు తన్ను తాను తగ్గించుకునే ప్రతి ఒక్కరూ ఒక రోజు అందరి ఎదుట హెచ్చింపబడుతారు మరియు ఘనత చెందుతారు."
"తన్ను తాను హెచ్చించు కొనువాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును."
ఒకసారి నన్ను ఒక సభకు వక్తగా ఆహ్వానించారు. నేను మాట్లాడటానికి ముందు, ఒక పాస్టర్ గారు ప్రార్థన చేయమని అడిగారు. ఆయన ప్రార్థన ప్రారంభించాడు. "ప్రభువా మాపై దయ చూపు, మేమంతా గాడిదలం, నీ ముందు మేమంతా కుక్కలమే ప్రభువా, మేమంతా మురికి పురుగులం ప్రభువా" అంటూ తనని తాను దిగజార్చుకుంటూ వెళ్ళిపోయాడు (తెలియకుండా స్టేజి మీద ఉన్న మమ్మల్ని కూడా). సభ ముగిసిన తరువాత, నేను అతనిని కలవడం మరియు అతనితో మాట్లాడటం నిశ్చయించుకున్నాను. కొంతమంది ప్రార్థనలో తమను తాము దిగజార్చుకోవడం ద్వారా తమను తాము తగ్గించుకుంటున్నారని అనుకుంటారు. ఇక్కడ లేఖనాలు ఈ విధంగా చెప్పడం లేదు. నేను మీకు చెప్తాను: క్రీస్తు యేసు తన అమూల్యమైన రక్తాన్ని మీ కొరకు చిందించిన వ్యక్తి మీరు, మరియు మిమ్మల్ని మీరు దిగజార్చుకోవడం ద్వారా, మీరు ఖచ్చితంగా దేవుణ్ణి మహిమపరచడం లేదు. దానే తప్పుడు తగ్గించుకోవడం అంటారు.
తన్ను తాను తగ్గించుకోవడమంటే అన్నిటికంటే ఎక్కువగా దేవునికి మన అవసరాన్ని గుర్తించడమే.
అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి, "చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియ్యుడి, దేవుని రాజ్యము ఇలాంటి వారిది." (లూకా 18:16)
పిల్లల పరిచర్యకు పునాది లేఖనము
"చిన్న బిడ్డవలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను." (లూకా 18:17)
మనం చిన్నపిల్లలలాగా ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు కానీ పిల్లవానిగా కాదు.
దీన్ని బాగా నేర్చుకోండి: ఒక చిన్న పిల్లవాడు పొందుకునే విధంగానే మీరు దేవుని రాజ్యం యొక్క ప్రత్యక్షతను పొందకపోతే, మీరు ఎన్నటికీ ప్రవేశించలేరు." (లూకా 18:17 TPT)
ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని? ఆయన నడిగెను. (లూకా 18:18)
అతను సరైన వ్యక్తి వద్దకు వచ్చినప్పటికీ, సరైన ప్రశ్న అడిగాడు మరియు సరైన సమాధానం పొందుకున్నప్పటికీ, అతడు తప్పు నిర్ణయం తీసుకున్నాడు. మీరు మీతో నిజాయితీగా లేనప్పుడు, మీరు దానిని ఎలా చేయగలరు?.
అందుకు యేసు, నేను సత్పురుషుడనని యేల చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. (లూకా 18:19)
రబ్బీలను బోధకులు అని అంటారు, కానీ రబ్బీని "సత్పురుషుడు" అని పిలవడం చాలా అసాధారణమైనది. యూదులు దేవునికి సత్పురుషుడు అనే పదాన్ని కేటాయించారు (కీర్తనాలు 25:8; 34:8; 86:5; 106:1). మన ప్రభువు ఆ అధికారి తన ఉద్దేశ్యం ఏమిటని ఎందుకు అడిగాడో ఇది తెలియజేస్తుంది, ఎందుకంటే అతడు నిజంగా యేసు "సత్పురుషుడు" అని విశ్వసిస్తే, అతడు యేసు దేవుడని ఒప్పుకోవలసి ఉంటుంది.
ఈ ప్రశ్న అడగడం ద్వారా, మన ప్రభువు తన దైవత్వమును తిరస్కరించలేదు, దానిని ధృవీకరించాడు. ఆయన ఇప్పుడే చెప్పినది నిజంగా అర్థం చేసుకున్నాడా లేదా అని అధికారిని పరీక్షిస్తున్నాడు. మనం ఏ ఉద్దేశ్యం లేనిది చెప్పే సందర్భాలు చాలా ఉన్నాయి - అదే ముఖస్తుతి.
రక్షణానికి సాధనంగా యేసు అతనికి ధర్మశాస్త్రాన్ని యథాతథంగా చెప్పలేదు
ఎందుకంటే ధర్మశాస్త్రానికి విధేయత చూపడం వల్ల మనం రక్షించబడం. ఆయన తన పాపాలను బహిర్గతం చేయడానికి ఆ అధికారి ముందు ధర్మశాస్త్రాన్ని అద్దంలా ఉంచాడు (రోమీయులకు 3:19-20; గలతీయులకు 2:21; 3:21).
Chapters