బానిసత్వం లేకుండా వేరొకరి పూర్తి నియంత్రణ మరియు ప్రభావంలో ఉన్నట్లు మీరు ఊహించగలరా? పౌలు యేసుక్రీస్తు సేవకుడిగా మాట్లాడుతున్నప్పుడు, అతడు 'డౌలోస్' అనే గ్రీకు పదాన్ని ఉపయోగిస్తున్నాడు, అయినప్పటికీ బానిసత్వం యొక్క అంతరార్థం లేదు.
పాత నిబంధనలో సమానమైన హీబ్రూ పదం ఉపయోగించబడింది మరియు "దాసుడు" అని అనువదించబడింది. నిర్గమకాండము 21:1-6లో, మనము చదువుతాము:
2 నీవు హెబ్రీయుడైన దాసుని కొనినయెడల వాడు ఆరు సంవత్సరములు దాసుడై యుండి యేడవ సంవత్సరమున ఏమియు ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. 3 వాడు ఒంటిగా వచ్చినయెడల ఒంటిగానే వెళ్లవచ్చును. వానికి భార్య యుండిన యెడల వాని భార్య వానితో కూడ వెళ్లవచ్చును. 4 వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తరువాత ఆమె వాని వలన కుమారులనైనను కుమార్తెలనైనను కనిన యెడల ఆ భార్యయు ఆమె పిల్లలును ఆమె యజమానుని సొత్తగుదురుకాని వాడు ఒంటిగానే పోవలెను. 5 అయితే ఆ దాసుడునేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచు న్నాను; నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లనని నిజముగా చెప్పిన యెడల, 6 వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసి కొని రావలెను, మరియు వాని యజమానుడు తలుపునొద్ద కైనను ద్వారబంధ మునొద్దకైనను వాని తోడుకొనిపోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడైయుండును.
మరో మాటలో చెప్పాలంటే, వారు సమస్తము సేవకత్వానికి చిహ్నంగా చెవి లంబికను కుట్టారు. ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే, ప్రేమ సంబంధం అభివృద్ధి చెంది, సేవకుడు స్వేచ్ఛగా వెళ్లకూడదనుకుంటే, అతన్ని నగరంలోని న్యాయదిపతుల యొద్దకు తీసుకువెళ్తారు, అక్కడ అతను తన యజమానికి బానిసగా ఉండాలనే కోరికను తెలియజేస్తాడు.
న్యాయపరమైన చిహ్నంగా అతని చెవిలో రంధ్రం చేయబడుతుంది. ఆ రంధ్రం ఈ వ్యక్తి తన ఉనికిని కోల్పోయాడని మరియు ఇప్పుడు అతని యజమానితో పూర్తిగా గుర్తించబడాలని సూచిస్తుంది. అతడు కేవలం యజమానునికి సేవ చేయడం మరియు వేతనాల కోసం పనిచేయడం మాత్రమే కాకుండా, తన యజమానితో పూర్తిగా గుర్తింపు పొందుతాడు.
ఇకపై అతడు కేవలం దాసుడు కాదు కానీ ఇంటి సభ్యుడు, కుటుంబంలో ఒక భాగం. అతనిని ఎప్పటికీ విడిచిపెట్టరు మరియు అతని ప్రతి అవసరానికి అతని యజమాని పూర్తిగా బాధ్యత వహించాడు.
"తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును" (నిర్గమకాండము 21:15)
"తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును" (నిర్గమకాండము 21:17)
ప్రభవు తల్లిదండ్రులకు ఎంతో విలువనిస్తాడు.
"ఒకడు నరుని దొంగిలించి అమ్మినను, తన యొద్ద నుంచు కొనినను, వాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును" (నిర్గమకాండము 21:16)
ధర్మశాస్త్రం ప్రకారం, యోసేపు సోదరులు మరణానికి అర్హులు, కానీ యోసేపు వారికి జీవితాన్ని ఇచ్చాడు. ప్రజలకు అర్హమైన వాటిని ఇవ్వవొద్దండి; వారికి కావలసినవి ఇవ్వండి. మీరు ప్రజలకు అర్హమైన వాటిని ఇస్తే, మీరు ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంటున్నారు; కానీ మీరు ప్రజలకు అవసరమైన వాటిని ఇస్తే, మీరు కృపతో నడుచుకుంటున్నారు. ధర్మశాస్త్రం ప్రకారం క్షమాపణ లేదు. కృప ద్వారా క్షమాపణ ఉంది.
"నరులు పోట్లాడుచుండగా గర్భవతి యైన స్త్రీకి దెబ్బతగిలి ఆమెకు గర్భపాతమే గాక మరి ఏ హానియు రానియెడల హానిచేసినవాడు ఆ స్త్రీ పెనిమిటి వానిమీద మోపిన నష్టమును అచ్చుకొనవలెను. న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాని చెల్లింపవలెను. హాని కలిగిన యెడల నీవు ప్రాణమునకు ప్రాణము" (నిర్గమకాండము 21:22-23)
దేవుడు గర్భం నుండి ప్రజలను పిలిచి అభిషేకం చేస్తాడు. నువ్వు మరియు నేనూ పుట్టకముందే, మనం మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు, దేవుడు మనల్ని పిలిచి, ఒక ఉద్దేశం కోసం ఎన్నుకున్నాడు.
జీవాన్ని (జీవితాన్ని) ఇచ్చేది తానే అని దేవుడు అన్నాడు, పాత నిబంధనలో జీవాన్ని ప్రాణంగా తీసుకోవలసి ఉంటుంది. కడుపులో ఉన్న బిడ్డ ప్రాణం తీయడం చాలా పాపం.
Chapters