మరియు ఆయన మోషేతో ఇట్లనెను, "నీవును, అహరోనును, నాదాబును, అబీహును, ఇశ్రాయేలీయుల పెద్దలలో డెబ్బదిమందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి." (నిర్గమకాండము 24:1)
ఈరోజు మీరు మరియు నేను దూరం నుండి ఆరాధించవల్సిన అవసరం లేదు.
కల్వరి సిలువపై ప్రభువైన యేసు మన కొరకు చేసిన దాని వలన మనం దేవునికి దగ్గరవ్వగలము.
మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. (నిర్గమకాండము 24:2)
దేవునికి దగ్గరవ్వడం అనేది కేవలం కొందరికే పరిమితం కాదు. అందరికీ అవకాశం కల్పించబడింది. ముసుగు తొలగిపోయింది, అందరికీ ప్రవేశం కల్పించబడింది.
దేవునికి దగ్గరవ్వడం కేవలం మతపరమైన కార్యము లేదా కర్తవ్యము కాదు - ఇది గొప్ప ప్రతిఫలానికి మార్గం.
"దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును" (యాకోబు 4:8)
మీకు మరియు దేవునికి మధ్య సాన్నిహిత్యం - ఒక సహవాసం - స్నేహం ఉంది. సర్వశక్తిమంతుడైన దేవునితో స్నేహం కంటే విలువైనది ఏదీ లేదు. అబ్రాహాము దేవుని స్నేహితుడు అని పిలువబడ్డాడు. ఆయన మీకు యొద్దకు వచ్చినప్పుడు, మీరు ఆయన స్వరాన్ని చాలా స్పష్టంగా వినగలరు - ఆయన సూచన, దిద్దుబాటు మరియు ప్రోత్సాహం పొందగలరు.
దేవునికి దూరంగా క్రైస్తవ జీవితానికి స్థిరపడకండి. దేవుని పట్ల దూరపు ఆలోచనగా ఉండకూడదు కానీ సమీప మరియు ప్రస్తుత వాస్తవికతగా ఉండాలి.
మరియు మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసెను. (నిర్గమకాండము 24:4)
మనకు ఏది ముఖ్యమైనదో మనము ఎల్లప్పుడూ దాని రాసుకుంటూ ఉంటాము. ప్రభువు నుండి వినడానికి ముఖ్యమైన మార్గాలలో ఒకటి ప్రభువు మాట్లాడే మాటలను రికార్డ్ (భద్రపరచడం) అని నేను నమ్ముతున్నాను. ఇది ప్రభువు మనతో మాట్లాడేడానికి, ఆయన మనకు చూపించే వాటికి మనం విలువనిచ్చే సంకేతాన్ని పంపుతుంది.
ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. ఆయన పాద ములక్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువువంటిదియు ఆకాశ మండలపు తేజమువంటిదియు ఉండెను. (నిర్గమకాండము 24:10)
అది ఎంతటి దృష్టి అయి ఉండాలి? ఇశ్రాయేలు దేవుణ్ణి చూడడం ఎంత గొప్ప భాగ్యం.
దేవుని పాదాల క్రింద నిగనిగలాడు నీలమయమైన రాతి ఉంది. మొత్తానికి మరో పరిధిని చూడగలిగేలా ఉంది.
ఆయన ఇశ్రాయేలీయులలోని ప్రధానులకు [తన్ను తాను దాచుకోవడానికి, వారి ధైర్యాన్ని మందలించడానికి లేదా వారికి హాని కలిగించడానికి] ఏ హానియు చేయలేదు; కానీ వారు [దేవుని సన్నిధి ప్రకటించబడటం] చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. (నిర్గమకాండము 24:11)
అపొస్తలుడైన పౌలు దేవుని ప్రత్యక్షతను చూశాడు మరియు మూడు పగళ్ళు మరియు మూడు రాత్రులు ఆహారం మరియు నీరు లేకుండా ఉపవాసతో ఉన్నాడు. (అపొస్తలుల కార్యములు 9:9)
అలాగే, దేవుడు వారిని చంపలేదు, ఎందుకంటే ఏ మానవుడు దేవుణ్ణి చూసి జీవించలేడు.
అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు కొండయెక్కి నాయొద్దకు వచ్చి అచ్చటనుండుము; నీవు వారికి బోధించునట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతిపలకలను నీకిచ్చెదను (నిర్గమకాండము 24:12)
బోధించవలసిన విషయం కొండపై మోషేకు ఇవ్వబడింది. అలాగే, ఒక బోధకుడు తన విషయాన్ని దేవుని నుండి - ఆయన సన్నిధి పర్వతంపై నుండి తెలుసుకొని బోధించవలసి ఉంటుంది.
మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండమీదికి ఎక్కెను. (నిర్గమకాండము 24:13)
దేవుని దాసుడైన మోషేకు ఒక పరిచారకుడు (సహాయకుడు) ఉన్నాడు. అలాగే, ప్రతి నాయకుడికి సహాయకుడు ఉండాలి. సహాయకుడు లేని విజయం అపజయం.
ఈరోజు మీరు మరియు నేను దూరం నుండి ఆరాధించవల్సిన అవసరం లేదు.
కల్వరి సిలువపై ప్రభువైన యేసు మన కొరకు చేసిన దాని వలన మనం దేవునికి దగ్గరవ్వగలము.
మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. (నిర్గమకాండము 24:2)
దేవునికి దగ్గరవ్వడం అనేది కేవలం కొందరికే పరిమితం కాదు. అందరికీ అవకాశం కల్పించబడింది. ముసుగు తొలగిపోయింది, అందరికీ ప్రవేశం కల్పించబడింది.
దేవునికి దగ్గరవ్వడం కేవలం మతపరమైన కార్యము లేదా కర్తవ్యము కాదు - ఇది గొప్ప ప్రతిఫలానికి మార్గం.
"దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును" (యాకోబు 4:8)
మీకు మరియు దేవునికి మధ్య సాన్నిహిత్యం - ఒక సహవాసం - స్నేహం ఉంది. సర్వశక్తిమంతుడైన దేవునితో స్నేహం కంటే విలువైనది ఏదీ లేదు. అబ్రాహాము దేవుని స్నేహితుడు అని పిలువబడ్డాడు. ఆయన మీకు యొద్దకు వచ్చినప్పుడు, మీరు ఆయన స్వరాన్ని చాలా స్పష్టంగా వినగలరు - ఆయన సూచన, దిద్దుబాటు మరియు ప్రోత్సాహం పొందగలరు.
దేవునికి దూరంగా క్రైస్తవ జీవితానికి స్థిరపడకండి. దేవుని పట్ల దూరపు ఆలోచనగా ఉండకూడదు కానీ సమీప మరియు ప్రస్తుత వాస్తవికతగా ఉండాలి.
మరియు మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసెను. (నిర్గమకాండము 24:4)
మనకు ఏది ముఖ్యమైనదో మనము ఎల్లప్పుడూ దాని రాసుకుంటూ ఉంటాము. ప్రభువు నుండి వినడానికి ముఖ్యమైన మార్గాలలో ఒకటి ప్రభువు మాట్లాడే మాటలను రికార్డ్ (భద్రపరచడం) అని నేను నమ్ముతున్నాను. ఇది ప్రభువు మనతో మాట్లాడేడానికి, ఆయన మనకు చూపించే వాటికి మనం విలువనిచ్చే సంకేతాన్ని పంపుతుంది.
ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. ఆయన పాద ములక్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువువంటిదియు ఆకాశ మండలపు తేజమువంటిదియు ఉండెను. (నిర్గమకాండము 24:10)
అది ఎంతటి దృష్టి అయి ఉండాలి? ఇశ్రాయేలు దేవుణ్ణి చూడడం ఎంత గొప్ప భాగ్యం.
దేవుని పాదాల క్రింద నిగనిగలాడు నీలమయమైన రాతి ఉంది. మొత్తానికి మరో పరిధిని చూడగలిగేలా ఉంది.
ఆయన ఇశ్రాయేలీయులలోని ప్రధానులకు [తన్ను తాను దాచుకోవడానికి, వారి ధైర్యాన్ని మందలించడానికి లేదా వారికి హాని కలిగించడానికి] ఏ హానియు చేయలేదు; కానీ వారు [దేవుని సన్నిధి ప్రకటించబడటం] చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. (నిర్గమకాండము 24:11)
అపొస్తలుడైన పౌలు దేవుని ప్రత్యక్షతను చూశాడు మరియు మూడు పగళ్ళు మరియు మూడు రాత్రులు ఆహారం మరియు నీరు లేకుండా ఉపవాసతో ఉన్నాడు. (అపొస్తలుల కార్యములు 9:9)
అలాగే, దేవుడు వారిని చంపలేదు, ఎందుకంటే ఏ మానవుడు దేవుణ్ణి చూసి జీవించలేడు.
అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు కొండయెక్కి నాయొద్దకు వచ్చి అచ్చటనుండుము; నీవు వారికి బోధించునట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతిపలకలను నీకిచ్చెదను (నిర్గమకాండము 24:12)
బోధించవలసిన విషయం కొండపై మోషేకు ఇవ్వబడింది. అలాగే, ఒక బోధకుడు తన విషయాన్ని దేవుని నుండి - ఆయన సన్నిధి పర్వతంపై నుండి తెలుసుకొని బోధించవలసి ఉంటుంది.
మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండమీదికి ఎక్కెను. (నిర్గమకాండము 24:13)
దేవుని దాసుడైన మోషేకు ఒక పరిచారకుడు (సహాయకుడు) ఉన్నాడు. అలాగే, ప్రతి నాయకుడికి సహాయకుడు ఉండాలి. సహాయకుడు లేని విజయం అపజయం.
Chapters